May 19, 2026
Explore
జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పరేష్‌కుమార్‌

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పరేష్‌కుమార్‌

May 19, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ జూనియర్‌ సివిల్‌జడ్జిగా పరేష్‌కుమార్‌ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పని చేస్తున్న పరేష్‌కుమార్‌ను పుంగనూరుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు న్యాయవాదులు ,సిబ్బంది స్వాగతం పలికారు. కేసులను సత్వరం పరిష్కరించేందుకు న్యాయవాదులు, కక్షిదారులు సహకరించాలని కోరారు.

Tags; Paresh Kumar Appointed as Junior Civil Judge