పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బయ్య దీక్షితులు స్వామివారికి పాలు, పెరుగు, తెనే, నెయ్యితో అభిషేకం చేశారు. రుద్ర నమక చమకాల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామివారికి నవరత్నాల కీరిటాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Tags: Special Worship to Sri Kashi Visveswara