May 18, 2026
Explore
ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు, ముహూర్తం ఫిక్స్

ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు, ముహూర్తం ఫిక్స్

May 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక ప్రకటన చేసింది.

రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది.

వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు సహా అర్హులైన వారందరికీ పింఛన్లు అందించనుంది.

ఇప్పటివరకు పింఛన్ రాని అర్హులు త్వరలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని..,

గత ప్రభుత్వంలో తొలగించిన పింఛన్ల సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Tags; Sanction of New Pensions in AP: Date Finalized