అమరావతిముచ్చట్లు:
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ సంస్కరణలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ‘సెబ్’ను రద్దు చేశారు. లాటరీ విధానంలో షాపుల కేటాయింపు ద్వారా దరఖాస్తుల రూపంలోనే రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.99కే నాణ్యమైన మద్యం, 45% డిజిటల్ చెల్లింపులు, బాటిల్ ట్రాకింగ్ కోసం ‘సురక్ష’ యాప్, తనిఖీల కోసం 5 అత్యాధునిక ల్యాబ్లు ఏర్పాటు చేశారు..
Tags: Liquor Sales Rise in the State!