పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం నుంచి ఉచితంగా యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు యోగా శిక్షణా కార్యక్రమం జరుగుతుందన్నారు. యోగా వలన కలిగే మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుందని తెలిపారు. అలాగే ప్రస్తుత జీవవశైలి , ఆహారం వల్ల చిన్న, పెద్ద అనే తేడా లేకుండ ఏదో ఒక ఆనారోగ్యం భారీన పడి ప్రజలు ఇబ్బందులకు గురౌతున్న సమయంలో ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని యోగా కార్యక్రమానికి హాజరుకావాలన్నారు.
Tags: Free Yoga Training Begins on the 16th