నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద తెలుగుదేశం ‘మహానాడు’ పనులకు భూమిపూజ నిర్వహించారు. మే 27, 28, 29 తేదీల్లో ఇఫ్కో కిసాన్ సెజ్లోని 2,200 ఎకరాల్లో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఈ పనులను ప్రారంభించారు. తొలిసారిగా జిల్లాలో రాష్ట్రస్థాయి మహానాడు నిర్వహిస్తుండటంతో క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. ఈ సభల్లో రాష్ట్ర భవిష్యత్తుపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
Tags; ‘Mahanadu’ Inaugurated in Simhapuri