April 8, 2026
Explore
నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమార్తె

నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమార్తె

April 8, 2026 | Andhra Pradesh

మంచిర్యాల ముచ్చట్లు:


మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ఏకారి వెంకటేష్, లక్ష్మి దంపతులు నిరక్షరాస్యులైనప్పటికీ, తమ ఇద్దరు కుమార్తెలైన లిఖిత, రసజ్ఞలకు ఉన్నత చదువులు అందించారు. తోపుడు బండిపై పండ్లు అమ్ముతూ కష్టపడి సంపాదించిన డబ్బుతో వారిని చదివించారు. పెద్ద కుమార్తె లిఖిత, ప్రణాళికాబద్ధమైన అధ్యయనంతో తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై, తల్లిదండ్రుల కలను నిజం చేసుకున్నారు. ఆమె లాసెట్‌లో మంచి ర్యాంకులు సాధించి, ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె రసజ్ఞ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) చేస్తున్నారు. లిఖిత తన విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, పట్టుదల ఉన్నాయని తెలిపారు.

Tags: A Daughter Who Fulfilled Her Illiterate Parents’ Dream