తిరుమల ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కీలక సూచన చేసింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల జారీ కేంద్రాలను టీటీడీ మూసివేసింది. భక్తుల రద్దీ, నిర్వహణ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, భక్తులు తిరుపతిలో టోకెన్ల కోసం నిరీక్షించకుండా నేరుగా రేపు తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తిరుమలకు చేరుకున్నాక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Tags:Issuance of SSD tokens suspended in Tirumala today.